జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు నగర పరిధిలోని అనధికార లేఅవుట్లు మరియు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణపై నగర కమిషనర్ పి.విశ్వనాథ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్యస్) మరియు భవన నిర్మాణ క్రమబద్ధీకరణ (బిపియస్) పథకాల పురోగతిపై పట్టణ ప్రణాళిక విభాగంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని, వీటి అమలులో సిబ్బంది ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తాను స్వయంగా క్షేత్రస్థాయిలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.
నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. భక్తుల భద్రతే ధ్యేయంగా ఆళ్లగడ్డ డిఎస్పి కె. ప్రమోద్ నేతృత్వంలో గురువారం ఒక సమగ్రమైన మాక్ డ్రిల్ (ముందస్తు శిక్షణ ప్రదర్శన) నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక మరియు వైద్య విభాగాలు సంయుక్తంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ఉత్సవాల సమయంలో ఎదురయ్యే విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ముఖ్యంగా అగ్నిప్రమాదాలు, భక్తుల రద్దీ వల్ల కలిగే తొక్కిసలాట వంటి క్లిష్ట పరిస్థితుల్లో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ఈ సందర్భంగా వివరించారు.
అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో ఈ నెల పదమూడు నుండి పదహారో తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు
మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామ సచివాలయం టు నందు బాల్యవివాహాలను అరికట్టాలని అంగన్వాడి టీచర్లు కే. పరిమళ, సజీవమ్మ, రుతమ్మ మరియు సచివాలయ సిబ్బంది, వైద్యాధికారులు,మరియు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.